టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chandrababu) హైదరాబాద్ నుంచి తిరుపతి(HyderabadTo Tirupati) పర్యటనకు బయలుదేరారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో క‌లిసి రేపు తిరుమల శ్రీవారిని(Tirumala Temple) దర్శించుకుంటారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేసి.. ద‌ర్శ‌నం అనంత‌రం రేపు మధ్యాహ్నం అమరావతికి వెళ్తారు. అనంత‌రం డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మ(Kanaka Durgamma Temple)ను దర్శించుకుంటారు.

టీడీపీ అధినేత చంద్రబాబు(TDP Chandrababu) హైదరాబాద్ నుంచి తిరుపతి(HyderabadTo Tirupati) పర్యటనకు బయలుదేరారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో క‌లిసి రేపు తిరుమల శ్రీవారిని(Tirumala Temple) దర్శించుకుంటారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేసి.. ద‌ర్శ‌నం అనంత‌రం రేపు మధ్యాహ్నం అమరావతికి వెళ్తారు. అనంత‌రం డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మ(Kanaka Durgamma Temple)ను దర్శించుకుంటారు. ఆ త‌ర్వాత‌ డిసెంబర్ 3న విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్నారు. డిసెంబర్ 3న సింహాచలం అప్పన్నను దర్శించుకుని.. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్నారు.

చంద్రబాబు మరికాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో తిరుపతి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకుని అతిథి గృహంలో చంద్రబాబు బస చేస్తారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బ‌య‌లుదేరి 12.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు.

Updated On 30 Nov 2023 6:20 AM GMT
Ehatv

Ehatv

Next Story