నారా లోకేష్‌(Nara Lokesh) యువగళం(Yuvagalam) విజయోత్సవ సభకు పవన్ కల్యాణ్(Pawan kalyan) రావడంలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) తెలిపారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధంకాలేదని..

నారా లోకేష్‌(Nara Lokesh) యువగళం(Yuvagalam) విజయోత్సవ సభకు పవన్ కల్యాణ్(Pawan kalyan) రావడంలేదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) తెలిపారు. శ‌నివారం ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధంకాలేదని.. అందుక‌నే పవన్ ఈ సభకు హాజరుకావడంలేదని వివరించారు. ఈ సభకు చంద్రబాబు(Chnadrababu), లోకేశ్(Lokesh), ఇతర టీడీపీ అగ్రనేతలు మాత్రమే హాజరవుతారని అచ్చెన్నాయుడు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాక చంద్రబాబు, పవన్ లతో భారీ సభ నిర్వహిస్తామని వెల్లడించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో భోగాపురం మండలం పోలేపల్లి వద్ద డిసెంబరు 20న యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ(TDP) సన్నద్ధమవుతోంది. యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 6 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నామని.. ఈ సభ నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేశామని వివ‌రించారు.

Updated On 16 Dec 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story