సీఎం జ‌గ‌న్‌(CM Jagan)కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అయితే విషెష్ చ‌క్క‌గా చెప్ప‌కుండ విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఓ ప్రక‌ట‌న ద్వారా తెలియ‌చేశారు. అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.

సీఎం జ‌గ‌న్‌(CM Jagan)కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. అయితే విషెష్ చ‌క్క‌గా చెప్ప‌కుండ విమ‌ర్శ‌నాత్మ‌కంగా ఓ ప్రక‌ట‌న ద్వారా తెలియ‌చేశారు. అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. బర్త్ డే పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకు ప్రకటనల రూపంలో రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం జగన్ రెడ్డి పెత్తందారీ పోకడలను తెలియజేస్తోందని విమ‌ర్శించారు. నెలకు ఒక్క రూపాయే గౌరవ వేతనం తీసుకుంటానని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి.. పుట్టినరోజు పేరుతో కోట్లు ఖర్చు చేయడం ఆయన రాచరిక పోకడలకు అద్దం పడుతోందని దుయ్య‌బ‌ట్టారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, సొంత పత్రిక సాక్షికి ప్రకటన ఇవ్వడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉపయోగకరమైన పనులు చేయడంపై ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరం అన్నారు. జీతాలు పెంచమని అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి.. తన పుట్టినరోజు కోసం కోట్ల రూపాయిలు వృథా చేయడం దేనికి సంకేతం? పైగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటు కాదా? అని మండిప‌డ్డారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని అన్నారు. పన్నుల బాదుడు, చార్జీల మోత, నిత్యావసరాల పెంపుతో పేద, మధ్యతరగతి నడ్డి విరిచారని.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఫైర్ అయ్యారు. ఇన్ని వైఫల్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటే గ్రాండ్‌గా బర్త్ డే ఎలా చేసుకోవాలపించిందో జగన్ రెడ్డికే తెలియాలని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Updated On 21 Dec 2023 3:41 AM GMT
Ehatv

Ehatv

Next Story