ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మరణం(Death) చాలా బాధాకరమన్నారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) రామోజీరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం అత్యంత విషాదకరమని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు(Ramoji Rao) మరణం(Death) చాలా బాధాకరమన్నారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) రామోజీరావు మృతి వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం అత్యంత విషాదకరమని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.
రామోజీరావు మృతి పట్ల తన ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.
ఆధునిక జర్నలిజానికి పితామహుడు గా నిలిచినా రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అనేక సంస్థలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించారని చెప్పారు. నిరంతరం ప్రజల మంచికోసం, సమాజ హితంకోసం పరితపించి పని చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావని, ఆయన మరణం ఒక్క తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Updated On 8 Jun 2024 3:12 AM GMT
Ehatv

Ehatv

Next Story