సీఎం వైయస్ జగన్(YS Jagan) సోమ‌వారం నాడు రాష్ట్రానికి చెందిన సిక్కు(Singh) పెద్దలతో తాడేప‌ల్లిలోని క్యాంపు(Camp) కార్యాలయంలో సమావేశమ‌య్యారు.

సీఎం వైయస్ జగన్(YS Jagan) సోమ‌వారం నాడు రాష్ట్రానికి చెందిన సిక్కు(Singh) పెద్దలతో తాడేప‌ల్లిలోని క్యాంపు(Camp) కార్యాలయంలో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సిక్కులు వారి సంప్ర‌దాయం ప్ర‌కారం ధ‌రించే సిక్కు త‌ల‌పాగాను సీఎం జ‌గ‌న్ త‌ల‌పై ధ‌రింప‌జేశారు సిక్కు పెద్ద‌లు. అనంత‌రం సిక్కులు భద్రత కోసం ఉప‌యోగించే ఆయుధం కృపాన్ ను సీఎంకు బ‌హుక‌రించారు. అనంత‌రం రాష్ట్రంలో సిక్కు జ‌నాభా, వారి స‌మ‌స్య‌లు, సంక్షేమంపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో నివ‌సిస్తోన్న‌ సిక్కు కుటుంబాల భ‌ద్ర‌త‌కు సీఎం సిక్కు పెద్ద‌ల‌కు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Updated On 8 May 2023 3:54 AM GMT
Ehatv

Ehatv

Next Story