అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి మూల‌విరాట్‌ను సూర్య కిర‌ణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం భ‌క్తుల‌కు క‌నువిందు చేసింది.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వామివారి మూల‌విరాట్‌ను సూర్య కిర‌ణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం భ‌క్తుల‌కు క‌నువిందు చేసింది. సుమారు 6 నిమిషాల పాటు లేలేత కిరణాలు స్వామివారిని తాకాయి. స్వామి వారి పాదాల నుంచి శిరస్సు వరకూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్ర‌తి ఏడాది రెండుసార్లు సూర్య‌కిర‌ణాలు మూల‌విరాట్‌ను తాకుతుంటాయి. ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీలలో, దక్షిణాయణం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతుంటాయి.

Updated On 9 March 2023 4:34 AM GMT
Ehatv

Ehatv

Next Story