తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు బయలుదేరిన మినీలారీ.. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకువెళ్లి తిరగబడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది ఉండ‌గా.. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు దుర్మరణం చెందారు. ప్ర‌మాదం అనంత‌రం డ్రైవర్‌ తప్పించుకుని పరారయ్యాడు. ప్ర‌మాదంలో గాయపడిన వ్య‌క్తిని ఘంటా మధుగా గుర్తించారు. డీఎస్పీ దేవకుమార్, ఎస్సైలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల‌ను దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), బొక్కా ప్రసాద్‌లుగా గుర్తించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు డ్రైవ‌ర్ కోసం గాలిస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story