లక్ష కోట్ల రూపాయల ప్రాపర్టీ కైవసానికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు.

లక్ష కోట్ల రూపాయల ప్రాపర్టీ కైవసానికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచంలోనే ఒక క్లాసికల్‌ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్లీ రుజువైందని అన్నారు. చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయిందన్నారు. 20 ఏళ్ల క్రిత చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోవటమే నేటి ఉదాహరణ.. ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారని అన్నారు. 850 ఎకరాల‌ స్థలాలు ఇచ్చేశారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని.. గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని.. కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారని స‌జ్జ‌ల వివ‌రించారు. అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారని అన్నారు. వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారన్నారు. లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారన్నారు. అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారని.. ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారని వివ‌రించారు. చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారని.. దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారని ఆరోపించారు. రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారన్నారు. చంద్రబాబును అంతర్జాతీయ స్కామ్ స్టర్‌గా తీర్చిదిద్దారు. అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్‌ని బయటపెడితే.. ఇప్పుడు చంద్రబాబు అమరావతి స్కామ్‌ని సీఎం జగన్‌ బయటపెట్టార‌న్నారు.

Updated On 8 March 2024 11:07 PM GMT
Yagnik

Yagnik

Next Story