పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో మంత్రి రోజా నగరిలో వెనుకంజలో

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో మంత్రి రోజా నగరిలో వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నారు. వైసీపీ నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

రాజమండ్రి రూరల్ లో రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2,870 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. మరో వైపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ లీడింగ్ లో కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

Updated On 3 Jun 2024 10:57 PM GMT
Yagnik

Yagnik

Next Story