నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు

నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఆగి ఉన్న లారీని కారు వచ్చి ఢీకొట్టింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణించిన అందరూ చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇ‍ద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

మృతులు అల్వాల్ కు చెందిన వారిగా గుర్తింపు. రాజకీయ నాయకుడు రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు నంద్యాల పోలీసులు. మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యుల మృతి. మృతుల్లో ఇద్దరు మహిళలు. మృతులను రవీందర్, లక్ష్మీ, సాయికిరణ్, ఉదయ్ కిరణ్, కావ్య శ్రీ గా గుర్తింపు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

Updated On 5 March 2024 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story