కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులోని 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెండగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను లక్ష్మీ(13), గోవర్ధిని(8) గా గుర్తించారు. హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Updated On 22 May 2024 9:19 PM GMT
Yagnik

Yagnik

Next Story