చంద్రబాబు నాయుడు అరెస్టును(chandrababu Naidu) నిరసిస్తూ టీడీపీ శ్రేణులు మంగళగిరి(Mangalgiri) పట్టణంలోని అంబేద్క‌ర్ విగ్రహాం(Ambedkar statue) వద్ద రిలే నిరహారదీక్షలు చేప‌ట్టారు(Relay Hunger Strike).

చంద్రబాబు నాయుడు అరెస్టును(chandrababu Naidu) నిరసిస్తూ టీడీపీ శ్రేణులు మంగళగిరి(Mangalgiri) పట్టణంలోని అంబేద్క‌ర్ విగ్రహాం(Ambedkar statue) వద్ద రిలే నిరహారదీక్షలు చేప‌ట్టారు(Relay Hunger Strike). 'బాబుతో నేను'(Babutho nenu) పేరుతో టీడీపీ శ్రేణులు రిలే నిరహారదీక్షలు చేపట్టాయి. మంగళగిరి పట్టణ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రిలే నిరహారదీక్షలు ప్రారంభ‌మ‌య్యాయి. అంబేద్క‌ర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి టీడీపీ నాయకులు దీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ రిలే నిరహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజుకో మండలం చొప్పున నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరహార దీక్షలు చేప‌ట్ట‌నున్న‌ట్లు నాయ‌కులు తెలిపారు. నిర‌స‌న‌లో భాగంగా నల్ల జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

Updated On 13 Sep 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story