ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పీడిస్తున్న వైసీపీ పాలనపై ఉమ్మడిగా పోరాడనున్నట్టు భారత చైతన్య యువజన పార్టీ- జై భీమ్ భారత్ పార్టీలు ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పీడిస్తున్న వైసీపీ పాలనపై ఉమ్మడిగా పోరాడనున్నట్టు "భారత చైతన్య యువజన పార్టీ" - జై భీమ్ భారత్ పార్టీ" లు ప్రకటించాయి. రాష్ట్ర చరిత్రలో జగన్ లాంటి నీచ ముఖ్యమంత్రి ఎన్నడూ లేరని, భవిష్యత్తులో కూడా ఉండరని.. అటువంటి పాలకుడిని ఏపీ నుండి తరిమి కొట్టేలా ప్రజలను చైతన్యం చేసే బాధ్యతను తాము తీసుకోనున్నట్టు ఆ పార్టీల అధినేతలు వెల్లడించారు. ఈ మేరకు శనివారం విజయవాడలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ల భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలను చర్చించారు. ఉమ్మడి పోరాట ప్రణాళికలు, ప్రజపోరాట అంశాలను చర్చించి, అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు.. జగన్ మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరిగారు. వైసీపీని గద్దె దించి, ప్రజలకు అధికారం ఇవ్వటమే లక్ష్యమని ప్రకటించారు.

Updated On 25 March 2024 6:11 AM GMT
Yagnik

Yagnik

Next Story