కూటమి(TDP alliance) కుట్రలన్నీ తిప్పికొడతామ‌ని వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba reddy) అన్నారు.

కూటమి(TDP alliance) కుట్రలన్నీ తిప్పికొడతామ‌ని వైసీపీ(YCP) సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ(Rajya sabha) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subba reddy) అన్నారు. విశాఖలో ఆయ‌న మాట్లాడుతూ.. వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు. కొంతమంది వైసీపీ సింబల్ తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా.. మా ప్రణాళిక మాకుంది అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓటింగ్ మాకున్నా.. వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే.. వాళ్లు ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం అవుతుంద‌న్నారు.

వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని.. మా అధ్యక్షుడు జగన్ కూడా పదే పదే అదే చెప్తుంటారని అన్నారు. కచ్చితంగా ఇటు స్టాండింగ్ కమిటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. రేపు జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం వైవీ సుబ్బారెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా నేతలతో చర్చించనున్నారు.

Eha Tv

Eha Tv

Next Story