ఒడిశా అంతర్భాగంపై వాయుగుండం కొనసాగుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి బలహీనపడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారింద‌ని వెల్ల‌డించింది

ఒడిశా అంతర్భాగంపై వాయుగుండం కొనసాగుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదిలి బలహీనపడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా మారింద‌ని వెల్ల‌డించింది. ఝార్సుగూడకి ఆగ్నేయంగా 70 కి.మీ.. సంబల్‌పూర్ కి తూర్పున 60 కి.మీ.. బిలాస్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 250 కి.మీ.. రాయ్‌పూర్ కి తూర్పున 290 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింద‌ని వివ‌రించింది. ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు సాయంత్రం నాటికి చత్తీస్‌గఢ్ మరియు ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంద‌ని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంద‌ని ఉత్తరాంద్ర తీరంలో ఈరోజు, రేపు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story