టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు అరెస్ట్పై(Chandrababu Arrest) సీడ‌బ్ల్యూసీ(CWC) స‌భ్యుడు, మాజీమంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్ వెన‌క బీజేపీ(BJP) ఉన్న‌ద‌న్నారు. బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారని అన్నారు. జగన్(Jagan) భుజం మీద నుంచి బీజేపీ పార్టీ చంద్రబాబును గురి పెట్టిందని అన్నారు.

టీడీపీ(TDP) అధినేత‌ చంద్రబాబు అరెస్ట్పై(Chandrababu Arrest) సీడ‌బ్ల్యూసీ(CWC) స‌భ్యుడు, మాజీమంత్రి రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు అరెస్ట్ వెన‌క బీజేపీ(BJP) ఉన్న‌ద‌న్నారు. బీజేపీ అనే అనకొండ కోరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారని అన్నారు. జగన్(Jagan) భుజం మీద నుంచి బీజేపీ పార్టీ చంద్రబాబును గురి పెట్టిందని అన్నారు. ఏపీలో బీజేపీ బలపడాలనుకోవటమే దీని వెనుక కారణమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు తెలియకుండా చంద్ర‌బాబు అరెస్ట్ జరగదని అన్నారు.

చంద్ర‌బాబు అరెస్ట్‌పై టీడీపీ ఎన్ని నిరసనలు, ఉద్యమాలు చేసినా ప్రయోజనం శూన్యమని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని.. అక్కడే పరిష్కారం అవుతాయని పేర్కొన్నార‌. బీజేపీని బలోపేతం చేసేందుకే ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశారని రఘువీరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ రాష్ట్రంలో బీజేపీ బలపడటానికేనని, భవిష్యత్తులో సీఎం జగన్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాక తప్పదని జోస్యం చెప్పారు.

Updated On 29 Sep 2023 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story