ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి జగన్(CM Jajan) గొప్ప మానవతావాది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ‌ అధ్యక్షుడు, వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ ఆర్ కృష్ణయ్య(R Krishnaiah )కొనియాడారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వాడుకున్నారని.. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవపరిచారని విమర్శించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి జగన్(CM Jajan) గొప్ప మానవతావాది అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ‌ అధ్యక్షుడు, వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ ఆర్ కృష్ణయ్య(R Krishnaiah )కొనియాడారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వాడుకున్నారని.. తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవపరిచారని విమర్శించారు. జగన్ పాలనలో గుడిసెల్లో ఉండేవాళ్లు కూడా డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని చెప్పారు. విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు.

జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు. జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని.. చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు.

Updated On 22 Nov 2023 10:52 PM GMT
Ehatv

Ehatv

Next Story