Prashanth Kishore: ప్రశాంత్ కిషోర్ చెప్పిందే నిజమైంది!!
వైసీపీ ఓటమిని ముందుగానే ఊహించిన వాళ్లలో ప్రముఖ రాజకీయ
![jagan prashant kishore jagan prashant kishore](https://s3.ap-south-1.amazonaws.com/media.ehatv.com/wp-content/uploads/2024/06/ys-jagan-prashant-kishore.jpg)
వైసీపీ ఓటమిని ముందుగానే ఊహించిన వాళ్లలో ప్రముఖ రాజకీయ
వైసీపీ ఓటమిని ముందుగానే ఊహించిన వాళ్లలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒకరు. ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని చాలా రోజులుగా చెబుతూ వచ్చారు ప్రశాంత్ కిషోర్. కొన్ని కీలక సూచనలు కూడా చేశారు.. దానిని వైసీపీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ ను తిట్టడం కూడా అదే పనిగా పెట్టుకున్నారు.
ఏపీలో జగన్ ఓటమి ఖాయమైందని ప్రశాంత్ కిషోర్ ముందుగానే అంచనా వేశారు. పోలింగ్ సరళిని వైసీపీ నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని.. ఏపీలో వైసీపీ చిత్తుగా ఓడిపోబోతోందన్నారు ప్రశాంత్ కిషోర్. దేశంలో ఎక్కడ ఎవరు ఓడిపోతారు? అనేది తాను అంచనా వేయగలనని.. జగన్ పార్టీ విషయంలో కూడా తన అంచనాలు తప్పవని అనుకుంటున్నానన్నారు. ఎన్నికల ఫలితాల ముందే తాము ఓడిపోతామని అంగీకరించరని.. జగన్ పార్టీ కూడా అంతేనన్నారు. గతంలో కంటే జగన్ ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నా.. కౌంటింగ్ రోజు ఫలితాలు జగన్ కు దిగ్భ్రాంతి కలిగిస్తాయని ముందుగానే ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
![Yagnik Yagnik](/images/authorplaceholder.jpg)