తాజాగా ప్రముఖ నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakaj raj) మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సలహా ఇచ్చారు.

తాజాగా ప్రముఖ నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakaj raj) మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సలహా ఇచ్చారు. తిరుపతి(tirupati) బాలాజీ ప్రసాదంలో పశువుల కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు మరియు బీఫ్ కొవ్వు కలుపుతున్నట్లు వచ్చిన వార్తలపై పవన్ కల్యాణ్ ఎక్స్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, "తిరుపతి బాలాజీ ప్రసాదంలో పశువుల కొవ్వు కలుపుతున్నారనేది చాలా బాధాకరం" అని అన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న విషయం అంటూ, పవన్ ఈ అంశంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

దీనికి ప్రతిస్పందనగా ప్రకాశ్ రాజ్ అదే ఎక్స్(twitter) వేదికగా పవన్ ను ప్రశ్నించారు. "మీరు ఏ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అక్కడే ఈ ఘటన జరిగింది. మీరు విచారణ చేయాలి. కానీ ఇలాంటి విషయాలను జాతీయ స్థాయి లో చర్చ జరగడానికి కారణం అయ్యి శాంతి భద్రతను ప్రశ్నించడం సమంజసం కాదు" అని పేర్కొన్నారు. ఇంకా ఆయన కేంద్రంలో ఉన్న పవన్ మిత్రులను ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా "మీ స్నేహితులు ఉన్న కేంద్రం కూడా ఈ అంశంపై జాగ్రత్తలు తీసుకోవాలి" అని అన్నారు.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయంగా ఇది మళ్లీ పెద్ద వాదనకు దారితీస్తుందని భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story