ప్రజాశాంతి పార్టీ(Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul).. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై(JD Lakshmi Narayana) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై స్పందించిన కేఏ పాల్.. లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేఏ పాల్ శ‌నివారం మాట్లాడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ తనను వెయ్యి కోట్లు అడిగారని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

ప్రజాశాంతి పార్టీ(Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul).. సీబీఐ(CBI) మాజీ జేడీ లక్ష్మీనారాయణపై(JD Lakshmi Narayana) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో సొంత పార్టీని ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై స్పందించిన కేఏ పాల్.. లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేఏ పాల్ శ‌నివారం మాట్లాడుతూ.. జేడీ లక్ష్మీనారాయణ తనను వెయ్యి కోట్లు అడిగారని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

విశాఖలో(Vizag) తాను ఎంపీగా(MP) నిలబడనని.. తనకు మద్దతిస్తానని గతంలో లక్ష్మీనారాయణ చెప్పారని పాల్ అన్నారు. తనను నిలబెట్టి, గెలిపిస్తానని ఆయన మాట ఇచ్చారని పేర్కొన్నారు. తనను వెయ్యి కోట్లు అడిగారని.. అకౌంట్లో డబ్బు చూపించమన్నారని, లేకపోతే పార్టీ పెడతానని అన్నారని చెప్పారు. రెండు నెలల క్రితం అమీర్ పేటలోని తమ కార్యాలయంలో ఇది జరిగిందని తెలిపారు. ఇప్పుడు ఆయనకు వెయ్యి కోట్లు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్‌ వెయ్యి కోట్లు ఇచ్చుంటుందని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీ గెలవకుండా.. ఓట్లు చీల్చడానికి లక్ష్మీనారాయణతో పార్టీ పెట్టిస్తున్నారని విన్నానని చెప్పారు.

Updated On 23 Dec 2023 7:48 AM GMT
Ehatv

Ehatv

Next Story