వంగవీటి రంగాను చంద్రబాబే చంపించారనే విషయం అందరికీ తెలుసునని.. వంగవీటి రంగాను

ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగా తరహాలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఉంటాడని కాపులంతా భావించారని.. కానీ ఆయన చర్యలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు పోసాని. సలహాలు ఇచ్చేవారంతా వైఎస్సార్‌సీపీ కోవర్టులంటూ పవన్‌ కళ్యాణ్ చెబుతూ ఉండడం నిజంగా దారుణమని అన్నారు. ముద్రగడను చంద్రబాబు ఎంత వేధించారో అందరికీ తెలుసని.. ముద్రగడను వేధింపునప్పుడు పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాపులను తిట్టిన వారితో పవన్‌ ఇప్పుడు ఎందుకు కలిసారో సమాధానం చెప్పాలన్నారు.

వంగవీటి రంగాను చంద్రబాబే చంపించారనే విషయం అందరికీ తెలుసునని.. వంగవీటి రంగాను ఎంత హింసించారో అందరికీ తెలుసన్నారు. రంగా కారులో చిన్న కర్ర దొరికినా పీఎస్‌కు తీసుకెళ్లారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని రంగా రాజీవ్‌గాంధీకి లేఖ కూడా రాశారు. దీనిపై రాజీవ్‌ వేగంగా స్పందించారన్నారు. ఎన్డీఆర్‌ను మించిపోతున్నాడనే రంగాను హత్య చేయించారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాలేనని పవనే చెబుతున్నాడు. చంద్రబాబుకే సీఎం అయ్యే అర్హత ఉందని పవన్‌ చెబుతున్నాడని.. అలాంటప్పుడు చంద్రబాబుకు కాపులందరూ ఎందుకు ఓటు వేయాలని పోసాని ప్రశ్నించారు. పవన్‌ తన వెనకాల నాదెండ్ల మనోహర్‌ను పెట్టుకున్నాడని.. పవన్‌ తన గుండెల్లో మాత్రం చంద్రబాబును పెట్టుకున్నాడన్నారు.

Updated On 8 March 2024 1:57 AM GMT
Yagnik

Yagnik

Next Story