జనసేన(Janasena) అధినేత పవన్‌ కళ్యాణ్(Pawan kalyan) కు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) సవాల్ విసిరారు. పవన్‌ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో(Elections) ఒంటరిగా పోటీ చేసి గెల‌వాల‌ని అన్నారు. సీఎం జగన్‌(CM Jagan) వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టే ఒంటరిగా పోటీ చేస్తాడని.. వైఎస్ జగన్‌కు కులం, మతం లేదన్నారు.

జనసేన(Janasena) అధినేత పవన్‌ కళ్యాణ్(Pawan kalyan) కు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) సవాల్ విసిరారు. పవన్‌ కళ్యాణ్ కు వ్యక్తిత్వం ఉంటే వచ్చే ఎన్నికల్లో(Elections) ఒంటరిగా పోటీ చేసి గెల‌వాల‌ని అన్నారు. సీఎం జగన్‌(CM Jagan) వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టే ఒంటరిగా పోటీ చేస్తాడని.. వైఎస్ జగన్‌కు కులం, మతం లేదన్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వైసీపీకి(YSRCP)ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడం మానేసి.. తనకు ఎన్ని సీట్లు వస్తాయో.. తనను గెలిపిస్తే ప్రజలకు ఏం చేస్తానో వివరిస్తే మంచిదని సూచించారు.

దుర్మార్గుడైన చంద్రబాబుకు(Chandrababu) సపోర్ట్ చేయకని పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు పోసాని. ఒక లైన్ తో జనాల్లోకి వెళితే చరిత్రలో నిలిచిపోతావని అన్నారు. మీ అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా నాకు టికెట్ ఇచ్చారని పోసాని గుర్తు చేసుకున్నారు. నువ్వు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పని పోసాని కృష్ణమురళి అన్నారు. పవన్ కళ్యాణ్ అమాయకుడు కాబట్టే భువనేశ్వరి(Bhuwaneswari), బ్రాహ్మణిలు(Brahmani) జ్యూస్‌ ఇవ్వగానే టీడీపీకి(TDP) మద్దతు ప్రకటించారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ఒంటరి వాడిని చేసి, ఆయన్ను మోసం చేసి చావడానికి కారణం అయిన వాళ్లు దండం పెట్టగానే పవన్ కళ్యాణ్ అభయం ఇచ్చేశాడంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.

Updated On 2 Oct 2023 6:26 AM GMT
Ehatv

Ehatv

Next Story