అనంతపురం(ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

అనంతపురం(ananthapuram) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అతనికి అప్పటికే పెళ్లయింది.. పిల్లలు కూడా ఉన్నారు. కానీ చిన్నమ్మ కూతురుపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. వావివరుసలు మర్చిపోయి పలుసార్లు అత్యాచారం(rape) చేశాడు. ఇంట్లో విషయం చెప్పొద్దంటూ బెదిరించాడు. ఈ క్రమంలోనే గర్భందాల్చిన బాలిక ఈనెల 7న ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కొంత సేపటికే బిడ్డ చనిపోయాడు. అనంతపురం పట్టణానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. బిడ్డను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాలిక వివరాలు నమోదు చేసుకొని ప్రసూతి వార్డులో ఉంచారు. విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో(POCSO) కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు దగ్గరి బంధువు కావడంతో అతనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలి కుటుంబసభ్యులు వెనకాడుతున్నారు. వావివరుసలు మర్చిపోయి అమాయకురాలి జీవితంతో ఆడుకున్న నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story