సినీ నటి, యూట్యూబర్‌ శ్రీరెడ్డిపై(Sri Reddy) కర్నూలు(Kurnool) మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఫిర్యాదు చేశారు.

సినీ నటి, యూట్యూబర్‌ శ్రీరెడ్డిపై(Sri Reddy) కర్నూలు(Kurnool) మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan kalyan), మంత్రులు లోకేశ్(Lokesh), అనితపై ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు వీడియోలను శ్రీరెడ్డి విడుదల చేశారు. శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన తెదేపా నాయకులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు సెక్షన్ 352, 353 BNS, 66ITA 2000-2008 కింద కేసులు నమోదు చేశారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story