టీడీపీ-జేఎస్పీ కూటమి నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మార్చి 15, 17 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో మోదీ నరేంద్ర మోదీ పర్యటన ఖరారు చేశారు. ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షోను ఏర్పాటు చేశారు. ఇక 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.

టీడీపీ-జేఎస్పీ కూటమి నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే తెలిపారు. శనివారం న్యూఢిల్లీలో బీజేపీతో ఎన్నికల పొత్తు ఖరారైన తర్వాత సీనియర్ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన నాయుడు, ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు సరైన వేదికను ఎంపిక చేయాలని ఆదేశించారు. మార్చి 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ-జేఎస్పీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు టీడీపీ-జేఎస్పీ కూటమిలో బీజేపీ చేరడం, మోదీ సమావేశానికి హాజరుకావడంతో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు.

Updated On 11 March 2024 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story