షర్మిల అన్నతో విబేధించి అన్న శత్రువులతో చేతులు కలిపారని.. మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిందని

సీఎం జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. 2014లో జగన్‌కు ఇప్పటికి చాలా తేడా ఉందని.. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అని ఆయన ఆ పార్టీలను ప్రశ్నించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారన్నారు. హామీలు అమలు చేయలేదని ప్రధాని మోదీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయటం కోసమే పాకులాడతాడని ఆయన అన్నారు. చిరంజీవి జనరంజక నటుడని.. చిరంజీవి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పాత్ర పోషించారని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయమని పవన్ కళ్యాణ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించ లేదా అంటూ ప్రశ్నించారు. మానవ సంబంధాల గురించి పవన్ కళ్యాణ్ చెప్పటం హాస్యాస్పదమన్నారు.

షర్మిల అన్నతో విబేధించి అన్న శత్రువులతో చేతులు కలిపారని.. మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసిందని విమర్శించినా అదే కాంగ్రెస్ జెండా మోస్తున్నారన్నారు. తల్లిని తిట్టిన పార్టీకి పల్లకి మోస్తున్నాడు పవన్ కళ్యాణ్, కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్‌ది అంటూ పేర్ని నాని విమర్శించారు. 2004 నుంచి జగన్ గురించి మొత్తం తెలుసంటున్నాడు బాలశౌరి. ఇంత చెడ్డ వాడని తెలిస్తే ఎందుకు వైసీపీలోకి వచ్చావ్ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 2004లో తెనాలికి వెళ్ళింది ఎవరని ప్రశ్నలు గుప్పించారు. 2009లో నర్సరావుపేటకు పారిపోయింది ఎవరని.. 2019లో మచిలీపట్నంకు వెళ్లింది ఎవరు అని ప్రశ్నించారు. బాలశౌరి మాటలు సరిగా మాట్లాడాలని హెచ్చరించారు పేర్ని నాని.

Updated On 6 Feb 2024 12:11 AM GMT
Yagnik

Yagnik

Next Story