వాలంటీర్ల పేరుతో జన్మభూమి కమిటీలను తీసుకుని వచ్చే ప్రమాదం కూడా ఉందని అన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ మరచిపోలేరు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం వాలంటరీ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. వాలంటీర్లకు డబుల్ జీతాలు కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీలు కురిపిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు నమ్మరని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి వరకు వలంటీర్లను ఇష్టానుసారం తిట్టిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ప్రేమ చూపిస్తారంటే ఎవరూ నమ్మరన్నారు. గోనె సంచులు మోస్తారు, ఆడవారి వివరాలు సేకరిస్తారు, అర్ధరాత్రి తలు­పులు కొడతారని వాలంటీర్ల గురించి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు వలంటీర్లను కొనసా­గిస్తానని అంటున్నారని.. అలాగే రూ.10 వేలు ఇస్తా అని అంటుంటే జనం అసలు నమ్మరని చెప్పారు.

వాలంటీర్ల పేరుతో జన్మభూమి కమిటీలను తీసుకుని వచ్చే ప్రమాదం కూడా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలోని సభ్యులనే వలంటీర్లుగా తేవాలనేది చంద్రబాబు పథకమని, అదెప్పటికీ జరగదని అన్నారు. వలంటీర్లు ఓటర్లను ప్రభా­వితం చేస్తారని బాబు అనడం అబద్ధమన్నారు. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, వృద్ధులు చనిపోతే దానిని వైఎస్సార్‌సీపీకి అంటగట్టాలని చూస్తున్నాని ఆరోపించారు.

Updated On 11 April 2024 9:30 PM GMT
Yagnik

Yagnik

Next Story