చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

టీడీపీ నేతలు సీఎం జగన్‌పై జరిగిన దాడిపై చేస్తున్న వ్యాఖ్యలను చూసి ప్రజలు ఛీదరించుకుంటూ ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ నీచంగా మాట్లాడుతున్నారని, జనాల్లో సీఎం జగన్‌పై సింపథీ ఎక్కడ పెరిగిపోతుందో అనే ఆందోళన టీడీపీలో మొదలైందని అన్నారు. సింపథీతో జనాలు ఓట్లేయరని విషయం అనుభవపూర్వకంగా చంద్రబాబుకు తెలుసన్నారు. చంద్రబాబు తన మీద రాళ్లు వేయించుకుని సింపథీతో గెలుద్దామని అనుకుంటున్నారన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశారని.. చంద్రబాబు పై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రజలు చిత్తుగా ఓడించిన విషయాన్ని బాబు గుర్తు తెచ్చుకోవాలన్నారు.

చంద్రబాబు వయసుకు తగినట్లు మాట్లాడటం లేదన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలన్నారు. చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌ను రాళ్లతో కొట్టండని చంద్రబాబే పిలుపు ఇచ్చారని.. చంద్రబాబు దగ్గర మంచి పేరు కోసం టీడీపీ వాళ్లే సీఎం జగన్‌పైకి రాళ్లు విసిరారని అన్నారు పెద్దిరెడ్డి. చంద్రబాబు చేస్తున్న ఈ నీచ రాజకీయాల్ని ఏపీ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.

Updated On 15 April 2024 1:03 AM GMT
Yagnik

Yagnik

Next Story