సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(APCC YS Sharmila) స్పందించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య‌మ అతిధిగా హాజ‌రైన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది అని జగన్(CM Jagan) అన్న‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.. దేవుడే గుణపాఠం చెప్తారట.. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగన్ ఆన్న కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు.

సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(APCC YS Sharmila) స్పందించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య‌మ అతిధిగా హాజ‌రైన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్ని చీల్చింది అని జగన్(CM Jagan) అన్న‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.. దేవుడే గుణపాఠం చెప్తారట.. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు, జగన్ ఆన్న కార‌ణ‌మ‌ని విమ‌ర్శించారు. ఇవ్వాళ YSR కుటుంభం(YSR Family) చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్నే.. దీనికి సాక్ష్యం దేవుడు.. దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ, నా యావత్ కుటుంభమ‌న్నారు.

జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఇబ్బందిలో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ ఆన్న వైపు నిలబడితే.. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు. ఇవ్వాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? అని ప్ర‌శ్నించారు. వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగామ‌ని.. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం, వాళ్ళను గెలిపించామ‌ని వివ‌రించారు.

వైసీపీ(YCP) కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి ఎండ అనక, వాన అనక రోడ్ల మీదనే ఉన్న.. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా.. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా.. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా.. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా.. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా.. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా.. మిమ్మల్ని గెలిపించా.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయ‌న‌ వేరే మనిషి, మారిపోయార‌న్నారు.

నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. YSR పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్న.. YSR పేరు నిలబెడతాడు అనుకున్నా.. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీ కి బానిసలు గా మారారని ఆరోపించారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు.. అయినా ఏపీలో బీజేపీ రాజ్యం ఏలుతుందన్నారు. జగన్ ఆయన పార్టీని, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడని విమ‌ర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ YSR డ్రీమ్ ప్రాజెక్ట్.. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం YSR చేశారు. వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రిగా ఆయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారు. 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 12 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత.. TDP, YCP ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిందన్నారు.

బాబు అధికారంలోకి వచ్చాక అంచనా వ్యయం 30 వేల కోట్లకు పెంచాడే తప్పా ఉపయోగం లేదన్నారు. వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారని అన్నారు. జగన్ ఆన్న ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ.. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ అని విమ‌ర్శించారు. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు.. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదన్నారు.

ఉద్యోగాలు లేవు.. నోటిఫికేషన్ లు ఇవ్వరు. 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్ లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదు. వైఎస్సార్ ప్రజల మనిషి.. ప్రజల మధ్యే బ్రతికాడు.. ఇప్పుడు జగన్ ఒక నియంత..పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు.. ప్రజలకు కనపడరు ..ఎమ్మెల్యేలను కలవరు.. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు.? తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

వైఎస్సార్ నష్టపోతున్న కంపెనీలను ప్రభుత్వ పరం చేయించారని.. మీరు ఉన్న ఆస్తులను అమ్ముతున్నారని దుయ్య‌బ‌ట్టారు. వైఎస్సార్ పేరును చెడగొట్టింది మీరేన‌న్నారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. నా అనుకున్న వాళ్ళను అందరినీ దూరం చేశారు. వైఎస్సార్ పాలనకు జగన్ ఆన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీని కలిశా.. వాళ్ళు వైఎస్సార్‌పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశా.. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారని వివ‌రించారు.

వైఎస్సార్ కుటుంభంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నాన‌న్నారు. నాన్న నాకు నేర్పించింది ప్రజల మధ్య ఉండాలని.. నన్ను కాంగ్రెస్ ఏపీకి వెళ్ళమంటే.. పని చేయాలని నిర్ణయించుకున్నాన‌ని వెల్ల‌డించారు.

ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్నాన‌న్నారు. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి.. నేను ఇక్కడ పని చేయాలని అనుకున్నాన‌న్నారు. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. నా వ్యక్తిగత నిర్ణయం అయితే.. 2019 లోనే నిర్ణయం తీసుకునేదాన్ని.. ఈ నిర్ణయం తో నేను టార్గెట్ అవుతా అని తెలుసు.. నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు.. నా కుటుంభం నిట్ట నిలువునా చీలుతుంది అని తెలుసు.. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమేన‌న్నారు.

Updated On 25 Jan 2024 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story