జనసేన పార్టీ(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) తలపెట్టిన వారాహి యాత్రకు(Varahi Yatra) ఆటంకాలు తప్పడం లేదు. యాత్ర మరోసారి రద్దు అయ్యింది. ఆదివారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభ తర్వాత పవన్‌కు జ్వరం వచ్చింది.

జనసేన పార్టీ(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) తలపెట్టిన వారాహి యాత్రకు(Varahi Yatra) ఆటంకాలు తప్పడం లేదు. యాత్ర మరోసారి రద్దు అయ్యింది. ఆదివారం అనకాపల్లిలో ఏర్పాటు చేసిన సభ తర్వాత పవన్‌కు జ్వరం వచ్చింది. దాంతో ఇవాళ జరగాల్సిన యలమంచలి పర్యటనను పవన్‌ రద్దు చేసుకున్నారు. మండుతున్న ఎండలకారణంగా పవన్‌కు తరచూ జ్వరం వస్తోంది. పవన్ వారాహి యాత్ర రద్దుకావడం ఇదేం మొదటిసారి కాదు! ఎండల తీవ్రత పెరుగుతుండడంతో పవన్ ఆరోగ్యం సహకరించడం లేదు. ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకున్నారు. ఆదివారం నుంచి వారాహి యాత్రను మళ్లీ మొదలుపెట్టారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన తర్వాత పవన్‌ అనారోగ్యానికి గురయ్యారు. అన్నట్టు ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.

Updated On 8 April 2024 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story