ప‌వ‌న్ రిక‌రెంట్ ఇన్‌ఫ్లుయెంజాతో బాధ ప‌డుతున్నార‌ని.. అందువల్ల ప‌వ‌న్ రోజూ

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మార్చి 30న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆయన ప్రచారం మొదలుపెట్టిన కొద్దిరోజులకే అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు జ్వరం రావడంతో ప్రచారానికి బ్రేక్ పడింది. పవన్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రచార సమయంలో పార్టీ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులు అనుసరించాల్సిన నిర్దిష్ట మార్గదర్శకాలను జనసేన విడుదల చేసింది.

ప‌వ‌న్ రిక‌రెంట్ ఇన్‌ఫ్లుయెంజాతో బాధ ప‌డుతున్నార‌ని.. అందువల్ల ప‌వ‌న్ రోజూ ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. క్రేన్‌లతో మోసుకెళ్ళే పెద్ద దండలను ఆయనకు వేయవద్దని మద్దతుదారులకు సూచించారు. పవన్ ముఖం వైపు నేరుగా పువ్వులు వేయవద్దని కూడా కోరారు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతనితో కరచాలనం లేదా ఫోటోగ్రాఫ్‌లకు దూరంగా ఉండాలని అభిమానులను అభ్యర్థించారు. "పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు వేయవద్దు. అదే విధంగా కరచాలనాలు, ఫొటోల కోసం ఒత్తిడి చేయవద్దు. పూలు చల్లినప్పుడు నేరుగా ఆయన ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, అభిమానులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము" అంటూ జనసేన నుండి ప్రకటన వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మతో కలిసి కూటమి పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో పవన్ పాల్గొన్నారు.

Updated On 21 April 2024 12:16 AM GMT
Yagnik

Yagnik

Next Story