నిత్యం వివాదాల్లో ఉండే బండ్ల గణేష్‌కు(Bandla ganesh) ఒంగోలు కోర్టు(Ongole Court) ఝలక్‌ ఇచ్చింది. చెక్‌ బౌన్స్‌ కేసులో(Cheque Bounce) అతనికి జైలుశిక్షతో పాటు, జరిమానా విధించడంతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి సినీ నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యాడు.

నిత్యం వివాదాల్లో ఉండే బండ్ల గణేష్‌కు(Bandla ganesh) ఒంగోలు కోర్టు(Ongole Court) ఝలక్‌ ఇచ్చింది. చెక్‌ బౌన్స్‌ కేసులో(Cheque Bounce) అతనికి జైలుశిక్షతో పాటు, జరిమానా విధించడంతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి సినీ నిర్మాత బండ్ల గణేష్ హాజరయ్యాడు. 2019లో ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద 95 లక్షలు బండ్ల గణేష్ తీసుకున్నాడు. తిరిగి ఆ డబ్బును చెల్లించాలని కోరడంతో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్కు బండ్ల గణేష్ చెక్కు ఇచ్చారు. ఈ చెక్కు బౌన్స్‌ కావడంతో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన ఒంగోలు సెకండ్‌ ఎం.ఎం.కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. రూ.95 లక్షల జరిమానా కూడా వేసింది. అయితే దీనిపై అప్పిలు చేసుకునేందుకు నెల రోజులు గడువును కోర్టు ఇచ్చింది.

Updated On 14 Feb 2024 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story