తెలుగుదేశం పార్టీకి(TDP) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు(Kollipudi Srinivasa Rao) వ్యవహారం మింగుడుపడడం లేదు.

తెలుగుదేశం పార్టీకి(TDP) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌రావు(Kollipudi Srinivasa Rao) వ్యవహారం మింగుడుపడడం లేదు. ఆయనపై పార్టీ కార్యకర్తలు, నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే ఉంటే పార్టీ భ్రష్టుపడుతుందని ఇంచార్జిని నియమించి పార్టీని కాపాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ మధ్యనే ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి( suicide attempt) ఓ వ్యక్తి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రి ఎదుటు టీడీపీ సెకండ్‌ క్యాడర్‌ కూడా ఆందోళనదిగింది. చిట్టేల స‌ర్పంచ్ తుమ్మ‌ల‌ప‌ల్లి శ్రీ‌నివాస‌రావును ఎమ్మెల్యే దూషించారని, ఆయనను బట్టలూడదీసి కొడతానని చెప్పడంతో ఆయ‌న భార్య మ‌న‌స్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. ఎన్నికలకు ముందు కూడా కొలికపూడి అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్యాడర్‌ను, కార్యకర్తలను దూషిస్తున్నారని కొలికపూడి శ్రీనివాస్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఇతను ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story