ఎన్డీఏ 292 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్కును అధిగమించినందున

ఎన్డీఏ 292 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్కును అధిగమించినందున నరేంద్ర మోదీ జూన్ 8న వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ ప్రధాని పదవికి, మంత్రి మండలి రాజీనామా చేయగా.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మోదీ తన పదవిలో కొనసాగాలని ముర్ము కోరారు.

సాయంత్రం 4 గంటలకు జరిగే కూటమి సమావేశానికి ఎన్డీయే సీనియర్ నేతలు ఢిల్లీ చేరుకోవడం ప్రారంభించారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే నేతలు చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

Updated On 5 Jun 2024 4:47 AM GMT
Yagnik

Yagnik

Next Story