నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సీఎం జ‌గ‌న్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

నరసరావుపేట(Narasaraopet) వైసీపీ(YSRCP) ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(Lavu Krishna Devarayalu) సీఎం జ‌గ‌న్‌(CM Jagan)కు గ‌ట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ(YCP) పార్టీకి, ఎంపీ(MP) పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. పల్నాడు(Palnadu) ప్రజలు నన్ను ఎంతో ఆదరించారని, గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారని అన్నారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషిచేశానని లావు శ్రీకృష్ణ దేవరాయులు పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట స్థానం నుంచి బీసీకి సీటు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించుకోవడంతో గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అసంతృఫ్తితో పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Updated On 23 Jan 2024 12:09 AM GMT
Yagnik

Yagnik

Next Story