అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్(Amaravathi Inner Ring Road) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున ఆయన తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోకేష్‌ ఏ14గా ఉన్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్(Amaravathi Inner Ring Road) అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ముందస్తు బెయిల్ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నందున ఆయన తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో లోకేష్‌ ఏ14గా ఉన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం రాజధానిలోని అన్ని రహదారులను అనుసంధానించే లక్ష్యంతో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) ప్రాజెక్టును నిర్వహించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (rk) ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ గత ఏడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. విచారణలో సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడి(A-1)గా పేర్కొంది. అలాగే మాజీ మంత్రి నారాయణను ఏ-2గా, నారా లోకేష్‌ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్ర‌త్యేకంగా మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి లబ్ధి పొందేందుకు లోకేష్ ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది.

తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, అలైన్ మెంట్ ప్రక్రియ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ భూసేకరణకు సంబంధించిన అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ నిర్ధారించింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారాయణ, లోకేష్, లింగమనేని రమేష్, రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్ నిందితులుగా ఏపీ సీఐడీ పేర్కొంది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్ర‌యించారు.

Updated On 27 Sep 2023 7:15 AM GMT
Ehatv

Ehatv

Next Story