రాజమండ్రి సెంట్రల్ జైల్లో(Rajahmundry Central Jail) ఉన్న‌ చంద్రబాబును(Chandrababu) ఆయ‌న కుటుంబ స‌భ్యులు కలిశారు. అనంత‌రం చంద్రబాబు భార్య‌ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari ) మాట్లాడుతూ..

రాజమండ్రి సెంట్రల్ జైల్లో(Rajahmundry Central Jail) ఉన్న‌ చంద్రబాబును(Chandrababu) ఆయ‌న కుటుంబ స‌భ్యులు కలిశారు. అనంత‌రం చంద్రబాబు భార్య‌ నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari ) మాట్లాడుతూ.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించేవార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ కోసం పోరాడే వ్యక్తిని నిర్బంధించారని అన్నారు. ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉండాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనేవారని అన్నారు.

టీడీపీ(TDP) ఎన్టీఆర్(NTR) నిర్మించిన పార్టీ.. అది ఎక్కడికి పోదు.. ఎవరూ ఏమి చేయలేరని అన్నారు. ఆయనను చూసి వచ్చేట‌ప్పుడు నా ఒక భాగం అక్క‌డే వదిలేసినట్టు ఉందని భువనేశ్వరి ఆవేదనకు గురయ్యారు. ఏపీని నెంబర్ వన్ గా నిలబెట్టాలని జీవితాన్ని దార పోశారని.. చంద్రబాబు భద్రతపై నాకు భయంగా ఉందని అన్నారు. ఆయ‌న‌ చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తున్నార‌ని.. జైలులో సరైన వసతులు కల్పించడం లేదని అనుమానం వ్య‌క్తం చేశారు.

Updated On 12 Sep 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story