మీరు ఎవరికి మద్దతిస్తారు. నేను కావాలో, చంద్రబాబు కావాలో చేతులెత్తి చెప్పండి

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఊహించని వైరల్ అయ్యాయి. నిజం గెలవాలి యాత్రలో భాగంగా శాంతిపురంలో మహిళలతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు నారా భువనేశ్వరి. కుప్పంలో తనకు మద్దతిస్తారా లేదా చంద్రబాబుకు మద్దతిస్తారా అంటూ అక్కడున్న వారిని ప్రశ్నించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్రబాబును 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు గెలిపిస్తున్నారని.. ఈసారి ఆయనకు రెస్ట్ ఇద్దామని భువనేశ్వరి అన్నారు. ఇదే క్రమంలో తనను గెలిపిస్తారా అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు.

" ఓ జోక్ వేస్తున్నా. మీ ఆన్సర్లన్నీ ఫ్రీగా ఇవ్వాలి. కుప్పం వచ్చిన తర్వాత నా మనసులో ఓ కోరిక కలిగింది. చంద్రబాబుపై నమ్మకంతో 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకో కోరిక కలిగింది. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి, నేను పోటీ చేద్దామని అనుకుంటున్నా. మీరు ఎవరికి మద్దతిస్తారు. నేను కావాలో, చంద్రబాబు కావాలో చేతులెత్తి చెప్పండి" అంటూ భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇదంతా సరదాగా చేసిన వ్యాఖ్యలు అని భువనేశ్వరి తెలిపారు. పదవులు తనకు వద్దన్నారు ఆవిడ. నారా భువనేశ్వరి కామెడీగా ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. వివాదాస్పదం అయ్యాయి. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన భార్యనే చెప్పారంటూ వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి ఆ వీడియోను తీసుకుని వెళుతున్నాయి.

Updated On 21 Feb 2024 10:05 PM GMT
Yagnik

Yagnik

Next Story