ఏపీలో కొలువుదీరిన‌ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని ప‌లు సంక్షేమ‌ పథకాల పేర్లను మారుస్తూ మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది

ఏపీలో కొలువుదీరిన‌ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని ప‌లు సంక్షేమ‌ పథకాల పేర్లను మారుస్తూ మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుకగా మారుస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఇచ్చిన‌ ఆదేశాల మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను 'పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్' గా మార్చారు. వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి 'ఎన్టీఆర్ విద్యోన్నతి' అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం పేరును 'సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకం'గా నామకరణం చేశారు.

వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై కూడా మంత్రి స్పందించారు. రాజీనామాలు చేయకుండా ఉద్యోగంలో ఉన్న వాలంటీర్లతో పని చేయించుకుంటామని అన్నారు. వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని.. వాలంటీర్ల నుంచి మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి తీసుకోమని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

Eha Tv

Eha Tv

Next Story