వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కళ్యాణ్

వైసీపీ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ కళ్యాణ్ ను ఓడిస్తాన‌ని స‌వాల్ చేసిన సంగతి తెలిసిందే. తాను చేసిన సవాల్ లో ఓట‌మి చెందాన‌న్నారు. త్వ‌ర‌లోనే తన పేరును ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకుంటాన‌ని సంచలన ప్రకటన చేశారు. గెజిట్ ప‌బ్లికేష‌న్ కోసం అంతా సిద్ధం చేసుకున్నానని.. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు. తన పేరు మారిన తర్వాత ఆ వివరాలు పంచుకుంటానన్నారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు. ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేద‌న్నారు.

పిఠాపురంలో జనసేన నేత పవ‌న్‌ కళ్యాణ్ ను ఓడించ‌క‌పోక‌పోతే త‌న పేరును ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మార్చుకుంటాన‌ని ఎన్నికలకు ముందు శ‌ప‌థం చేసిన సంగతి తెలిసిందే. అన్న మాట ప్రకారమే త‌న పేరు మార్చుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపొందిన నాయకులకు, కూటమికి ముద్రగడ శుభాకాంక్షలు తెలిపారు. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని తెలిపారు.

Updated On 5 Jun 2024 12:22 AM GMT
Yagnik

Yagnik

Next Story