అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి.. ప్రజలకు అందుబాటులో

చిన్న సినిమా ఆర్టిస్టులతో తనను జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తిట్టిస్తున్నారని.. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తనను విమర్శించాలని వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్‌ విసిరారు. మీడియా ముందుకొచ్చి తనను కొన్ని ప్రశ్నలు అడిగితే తాను కూడా పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నారు. పవన్‌ సిని­మాలు తీసుకోవడానికి పిఠాపురంలో ఎమ్మెల్యే పదవి కావాలనడం విడ్డూరంగా ఉందని.. పవన్‌ తనతోపాటు నారా లోకేశ్‌ను, నందమూరి బాలకృష్ణను కూడా తీసుకొచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయించగలరా అని ముద్రగడ ప్రశ్నించారు.

అప్పుడప్పుడూ వచ్చి రాజకీయాలు చేసే నాయకులను పక్కన పెట్టి.. ప్రజలకు అందుబాటులో ఉండే కాకినాడ పార్లమెంట్‌ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ను, పిఠాపురం అభ్యర్థి వంగా గీతను గెలిపించాలని ముద్రగడ ప్రజలను కోరారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి అగ్నికుల క్షత్రియులు, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున కాకినాడ జిల్లా కిర్లంపూడికి తరలివచ్చి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతున్న వైఎస్‌ జగన్‌ మరో 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ముద్రగడ అన్నారు.

Updated On 10 April 2024 11:46 PM GMT
Yagnik

Yagnik

Next Story