నిజామాబాద్‌(Nizamabad) ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Arvindh) తాజాగా చేసిన కామెంట్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనాలు రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి(YS Rajashekar reddy) హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోలేదని, కచ్చితంగా ఆయనను హత్య(Murder) చేసి చంపేశారని అర్వింద్‌ అంటున్నారు.

నిజామాబాద్‌(Nizamabad) ఎంపీ ధర్మపురి అర్వింద్‌(MP Dharmapuri Arvindh) తాజాగా చేసిన కామెంట్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనాలు రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి(YS Rajashekar reddy) హెలికాఫ్టర్‌ ప్రమాదంలో చనిపోలేదని, కచ్చితంగా ఆయనను హత్య(Murder) చేసి చంపేశారని అర్వింద్‌ అంటున్నారు. పైగా వైఎస్‌ఆర్‌ను హత్య చేయించింది ఎవరో కూడా తనకు తెలుసని చెప్పారు. తనను టార్గెట్‌ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని, అందరి చిట్టా విప్పుతానని, అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన సమయంలో అర్వింద్‌ తండ్రి ధర్మపురి శ్రీనివాస్‌(Dharmapuri Srinivas) ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్న విషయం తెలిసిందే! ఆనాటి కాంగ్రెస్‌ నాయకుల చరిత్ర అంతా తనకు తెలుసని అర్వింద్‌ చెబుతున్నారు. తన జోలికి రావద్దని, చరిత్ర చదివించుకోవద్దని కాంగ్రెస్‌ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. నిజంగానే వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది హత్యే అయితే ఇంతకాలం అర్వింద్‌ ఎందుకు మౌనంగా ఉన్నట్టు? ఇప్పటికైనా ఆ పని చేసింది ఎవరో చెబితే బాగుంటుంది కదా!నేరస్తులను తప్పించే ప్రయత్నం చేయడం కూడా నేరమేనన్న విషయం అర్వింద్‌కు తెలియదా?

Updated On 22 Feb 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story