భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజధానిలో 50వేలకు పైగా పేదలకు స్థలాలిస్తే టీడీపీ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్నారని తిరువూరు(Tiruvuru) ఎమ్మెల్యే రక్షణ నిధి(MLA Rakshana Nidhi) అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజధానిలో 50వేలకు పైగా పేదలకు స్థలాలిస్తే టీడీపీ(TDP) కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు. ఆర్-5 జోన్ పరిధిలో పేదలు ఉండకూడదన్న దురుద్దేశంతో టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కరోనా కష్టకాలంలో సెంటు భూమిలేక చనిపోయిన వారి కష్టాలు చూస్తే ప్రతిపక్షానికి బుద్ధి వచ్చేదన్నారు. పేదల పక్షపాతి సీఎం జగన్(CM Jagan) రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి నివాస‌ స్థలాలిచ్చి వారి కలలను సాకారం చేశారన్నారు. తిరువూరు టికెట్ నాదే, మూడోసారి గెలిచేది నేనే అని రక్షణ నిధి ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 77 సచివాలయాల పరిధిలో 81 వేలకు పైగా ఇళ్లకు గడప గడపకు కార్యక్రమం ద్వారా వెళ్లడం జరిగిందని వెల్ల‌డించారు.

Updated On 18 July 2023 8:32 AM GMT
Yagnik

Yagnik

Next Story