రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ సింగిల్ గా సింహంలా పోటీచేస్తారని.. ప్రజలు అత్యధిక సీట్లు కట్ట బెడతారని మంత్రి ఉషశ్రీ చరణ్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు పర్సనల్ ఎజెండాతో వస్తున్నారని అన్నారు.

రానున్న ఎన్నికల్లో సీఎం జగన్(CM Jagan) సింగిల్ గా సింహం(Lion)లా పోటీచేస్తారని.. ప్రజలు అత్యధిక సీట్లు కట్ట బెడతారని మంత్రి ఉషశ్రీ చరణ్(Minister Ushasri Charan) విశ్వాసం వ్య‌క్తం చేశారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu), లోకేశ్(Lokesh), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఎన్నికలకు పర్సనల్ ఎజెండాతో వస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ జూన్ నుంచి ఇక్కడ ఉన్నా ఏమి కాదని.. గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర ఆయ‌న‌ద‌ని ఎద్దేవా చేశారు. వై నాట్ 175 టు 175 అని అడిగారు. దుష్ట చతుస్టయంలో భాగంగానే దత్త పుత్రుడు ఉన్నాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి పవన్ గురించి చెప్పారని అన్నారు. 2014 నుంచి 2019 వ‌ర‌కూ టీడీపీ ఏమి చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రానున్న కాలంలో టీడీపీ(TDP) ఏమి చేస్తుందో ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ మ్యానిపేస్టో(Manifesto)లో చెప్పిన‌ విధంగా.. ప్రతి గ్రామంలో 95శాతం హామీలు నెర‌వేర్చామ‌న్నారు. వైసీపీ(YSRCP)లో ఎలాంటి విభేదాలు లేవని.. మీడియా దీనిపై హైప్ చేస్తుందని మంత్రి ఉషశ్రీ చరణ్ స్ప‌ష్టం చేశారు.

Updated On 12 May 2023 10:04 PM GMT
Yagnik

Yagnik

Next Story