ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆర్ధరాత్రి మంత్రి రోజా అనారోగ్యానికి గురికాగా.. విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆమె కాలినొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా(Minister Roja) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆర్ధరాత్రి మంత్రి రోజా అనారోగ్యాని(Illness)కి గురికాగా.. విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆమె కాలినొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ స‌భ్యులు ఆమెను చెన్నై(Chennai)లోని థౌజెండ్ లైట్స్‌(Thousand Lights)లోగల అపోలో ఆసుపత్రి(Apollo Hospitals)కి తీసుకెళ్ల‌గా.. అక్క‌డ ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాలివాపు తగ్గిందని, త్వరలో ఆమెను డిశ్చార్జ్(Discharge) చేస్తామని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నట్లు స‌మాచారం.

Updated On 10 Jun 2023 9:56 PM GMT
Yagnik

Yagnik

Next Story