ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. అభ్యర్థులు మండే ఎండలను కూడా తట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మంత్రి రోజా(Minister Roja) కూడా ఎన్నికల ప్రచారం(Election Campaign)లో విస్తృతంగా పాల్గొంటున్నారు. బుధవారం నగరి నియోజకవర్గం(Nagari Constituency)లోని నిండ్ర మండలం కొప్పేడు పంచాయితీలో ప్రజలను కలుసుకున్నారు.

ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. అభ్యర్థులు మండే ఎండలను కూడా తట్టుకుని ప్రచారం చేస్తున్నారు. మంత్రి రోజా(Minister Roja) కూడా ఎన్నికల ప్రచారం(Election Campaign)లో విస్తృతంగా పాల్గొంటున్నారు. బుధవారం నగరి నియోజకవర్గం(Nagari Constituency)లోని నిండ్ర మండలం కొప్పేడు పంచాయితీలో ప్రజలను కలుసుకున్నారు. అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అందరికీ ఆదర్శనంగా నిలుస్తున్న రోజమ్మను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కోప్పేడు దళితవాడ, వేదంతపురం ఎస్టీ కాలనీ గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. తమ గ్రామానికి అడుగుపెట్టిన రోజాకు వారు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్(CM Jagan), నగరిలో తాను గత అయిదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు మంత్రి రోజా. ప్రతి ఒక్కరూ మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రిగా, నగరిలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని రోజా విన్నవించుకున్నారు.

Updated On 1 May 2024 5:50 AM GMT
Ehatv

Ehatv

Next Story