వైఎస్ షర్మిల(YS Sharmila) గురువారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. త‌న‌ పార్టీని కూడా ఆమె కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. షర్మిల కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరడంపై ప‌లువురు స్పందింస్తున్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) కూడా ఈ విష‌య‌మై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

వైఎస్ షర్మిల(YS Sharmila) గురువారం కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. త‌న‌ పార్టీని కూడా ఆమె కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. షర్మిల కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరడంపై ప‌లువురు స్పందింస్తున్నారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) కూడా ఈ విష‌య‌మై ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరినంత మాత్రాన తామూ పార్టీ మారి మా కాళ్లు మేమే నరుక్కుంటామా అని ప్ర‌శ్నించారు.

కుటుంబాల్లో చిచ్చుపెట్టడం టీడీపీ(TDP), కాంగ్రెస్ పార్టీలకు బాగా తెలుసని విమ‌ర్శించారు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు(Chandrababu) మళ్లీ సీఎం అవుతా అని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఏపీ ప్రజలు సీఎం జగన్‌కు మద్దతుగా ఉన్నారనీ.. ఆయన‌ను మరోసారి సీఎం చేయడం పక్కా అని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. తాము సీఎం జగన్‌తోనే కలిసి నడుస్తామని చెప్పారు. ఇతర పార్టీల్లో ఎవరు చేరినా కానీ వారిని ప్రత్యర్థులుగానే చూస్తామన్నారు. జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని తాము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని గుర్తు చేశారు. ఎవరో రెచ్చగొడితే మాట్లాడటం సబబు కాదని అన్నారు

Updated On 4 Jan 2024 6:34 AM GMT
Ehatv

Ehatv

Next Story