చంద్రబాబు(Chandrababu) అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు(Minister Karumuri Nageswara Rao) అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు.. కానీ సీఎం జ‌గ‌న్(CM jagan) ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని అన్నీఆన్నారు.

చంద్రబాబు(Chandrababu) అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు(Minister Karumuri Nageswara Rao) అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు.. కానీ సీఎం జ‌గ‌న్(CM jagan) ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని అన్నీఆన్నారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాపం పండింది కాబట్టే ఇప్పుడు జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం(Skill Development Scam) సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు.

చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి కేసుల నుంచి బయటపడటానికి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని అన్నారు. చంద్ర‌బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. చంద్ర‌బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు అవినీతిని ఎండకడతానన్న పవన్.. టీడీపీతోనే కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డానికి ప‌వ‌న్ వ‌ద్ద ఏ విష‌యం లేద‌న్నారు.

Updated On 6 Oct 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story