సీఐడీ(CID) విచారణ తర్వాత లోకేష్(Lokesh) సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరని అన్నారు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి కానీ..

సీఐడీ(CID) విచారణ తర్వాత లోకేష్(Lokesh) సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ఎద్దేవా చేశారు. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. దొంగతనం చేసిన వాళ్ళు ఒక్కసారితో నిజం చెప్పరని అన్నారు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం(Inner Ring Road scam) చుట్టూనే ఉంటాయి కానీ.. లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదని సెటైర్లు సంధించారు. మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని.. లోకేష్ తప్పుకు శిక్షపడ‌టం ఖాయమని అన్నారు. హెరిటేజ్ కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు.. లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలన్నారు.

చంద్ర‌బాబు(Chandrababu) ఆరోగ్య స‌మ‌స్య‌ల‌పై(Health Problem) మంత్రి స్పందిస్తూ.. చంద్రబాబు ఉన్న‌ది వెల్ నెస్ సెంటర్లో కాదు.. జైల్లో వున్నారని అన్నారు. నేరం చేసిన వాళ్ళు ఉండేందుకే.. జైళ్లను పెట్టార‌ని.. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే వార్తలు కేవలం సింపతీ కోసమేనని కొట్టిపారేశారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు డీహైడ్రేషన్ వచ్చినా.. దోమలు కుట్టినా.. జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. విశాఖలో ఐటీ అభివృద్ది దిశగా ప‌య‌నిస్తుంద‌న్నారు. 16న ఇన్పోసిస్ కార్యలయంను సీఎం జ‌గ‌న్ ప్రారంభిస్తార‌ని తెలిపారు.

Updated On 11 Oct 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story