తెలంగాణలో(Telangana) ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో(Thadepally) ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ..

తెలంగాణలో(Telangana) ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయని స్ప‌ష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో(Thadepally) ఆయ‌న మీడియాతో(Media) మాట్లాడుతూ.. నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar) విషయంలో కొందరు రెచ్చగొట్టి విద్వేషాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్‌ సగం గేట్లు ఏపీ భూభాగంలోనే ఉన్నాయని.. అక్కడికి వెళ్లాలన్నా తాము తెలంగాణ పోలీసుల పర్మిషన్‌ తీసుకోవాల్సి వస్తోందని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అక్కడికి వెళ్లి తమ వాటా నీళ్లు వదులుకోవడం తమ హక్కు.. అందుకే అక్కడికి వెళ్లామని వివ‌రించారు. తాము దండయాత్ర చేయలేదని.. తమ రాష్ట్ర హక్కును కాపాడుకున్నామని తెలిపారు.

మా రాష్ట్ర పోలీసులపై తెలంగాణ విజయపురి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌(FIR) చెల్లదన్నారు. పోలీసులు మా భూభాగంలోనే ఉన్నారని.. మేము వారితో ఘర్షణ పడలేదని వివ‌రించారు. మా హక్కు సాధించుకున్నాం.. ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరూ గమనించాలని కోరారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని.. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దని ప‌లు మీడియా సంస్థలకు సూచించారు.

Updated On 1 Dec 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story